- జలవిహార్ వద్ద హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో బ్యూటిఫికేషన్ పనులు
- తొందరలోనే ప్రారంభిస్తామంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్, వెలుగు : సిటిజన్లు కుటుంబంతో సహా వచ్చి హుస్సేన్ సాగర్ తీరాన్ని చూస్తూ సేద తీరేందుకు మరో పార్కు అందుబాటులోకి రానుంది. జల విహార్ వద్ద ‘ లేక్ ఫ్రంట్ పార్క్’ ను హెచ్ఎండీఏ అందంగా తీర్చిదిద్దుతోంది. జల విహార్ పక్కనే 10 ఎకరాల స్థలంలో ఈ పార్కును డెవలప్ చేశారు. ఇందులో ప్రత్యేకంగా నాలుగు ఎలివేటెడ్ వాక్ వేలను నిర్మించారు. ఈ వాక్వేపై నుంచి హుస్సేన్ సాగర్ పరిసరాల అందాలను చూడొచ్చు.
పెవిలియన్స్, పంచతత్వ వాక్వే, సెంట్రల్ పాత్వే, అండర్ పాసెస్ వంటివి నిర్మించారు. వాటర్ బాడీకి 15 మీటర్ల పొడవుతో క్యాంటీలివర్ ఏర్పాటు చేశారు. డెకొరేటివ్ ఎల్ఈడీ లైటింగ్, హైమాస్ట్ లైటింగ్, నవికోమ్ లైటింగ్, నియోఫ్లెక్స్ లైటింగ్తో పాటు సందర్శకులను ఆకట్టుకునేందుకు ఈ పార్కులో ఎన్నో ప్రత్యేకతలున్నట్లు అధికారులు తెలిపారు.
అయితే, ఈ పార్కుకు సంబంధించిన వీడియోను ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేసిన మంత్రి కేటీఆర్.. తొందరలోనే దీన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు.