బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మహాత్మా జ్యోతిబా ఫూలే స్కూల్ ప్రిన్సిపాల్ రమాదేవి, డిప్యూటీ వార్డెన్ సుజాతను సస్పెండ్ చేస్తూ ఎంజేపీ పాఠశాలల రాష్ట్ర కార్యదర్శి బి.సైదులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 22న స్కూల్ భోజనం వికటించి 23 మంది విద్యార్థినులు అస్వస్థకు గురవగా, ఘటనకు బాధ్యులైన ప్రిన్సిపాల్, డిప్యూటీ వార్డెన్ ను విచారణ అనంతరం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్ గా నవ్యకుమారికి బాధ్యతలు ఇచ్చారు.
