నందిగ్రామ్‌‌లో మమతా బెనర్జీ ఓటమి

నందిగ్రామ్‌‌లో మమతా బెనర్జీ ఓటమి

కోల్‌‌కతా: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో  ఓటమి పాలయ్యారు. ఒకప్పటి తన అనుకూలుడు, కుడిభుజంగా భావించే సువేందు అధికారి (బీజేపీ అభ్యర్థి).. దీదీపై 1,622 ఓట్ల తేడాతో నెగ్గారు. రౌండ్ రౌండ్‌‌కు ఆధిక్యం మారుతూ వచ్చిన ఈ పోటీలో చివరికి సువేందుదే పైచేయి అయ్యింది. నందిగ్రామ్‌‌లో తనపై పోటీ చేయాలని, 50 వేల ఓట్ల తేడాతో ఓడిస్తానని ఎన్నికలకు ముందు దీదీకి సవాల్ విసిరిన సువేందు.. మొత్తానికి తన పంతం నెగ్గించుకున్నారు. కాగా, నందిగ్రామ్ ప్రజల తీర్పును తాను గౌరవిస్తున్నానని మమత అన్నారు. తాను ఓడినా రాష్ట్రవ్యాప్తంగా 221 సీట్లు గెల్చుకున్నామని ఆమె స్పష్టం చేశారు. ఈ గెలుపు దేశ ప్రజల విక్టరీ అని పేర్కొన్నారు.