- బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
కోల్కతా: టీచర్ రిక్రూట్మెంట్ స్కాంలో నేరం రుజువైతే పార్థ ఛటర్జీకి జీవిత ఖైదు విధించినా అభ్యంతరంలేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కామెంట్ చేశారు. మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టయిన తృణమూల్ కాంగ్రెస్ మంత్రి పార్థ ఛటర్జీ విషయంలో ఆమె సోమవారం తొలిసారి మాట్లాడారు. ఈ కేసును వీలైనంత త్వరగా తేల్చాలని కోరారు. ఎవరు తప్పు చేసినా తాను సహించబోనని, అవినీతికి మద్దతు ఇవ్వబోనని చెప్పారు.
మమతకు ఛటర్జీ మూడు సార్లు ఫోన్ !
మనీల్యాండరింగ్ కేసులో అరెస్టైన పార్థ ఛటర్జీ సీఎం మమతతో మాట్లాడేందుకు ప్రయత్నించారని ఈడీ అధికారులు చెప్పారు. అరెస్టు తర్వాత మూడుసార్లు సీఎంకు ఫోన్ చేశారని తెలిపారు. అయితే, సీఎం మమతా బెనర్జీ ఫోన్లో అందుబాటులోకి రాలేదని అధికారులు వివరించారు.