కాంగ్రెస్తో కూడిన 24 ప్రతిపక్ష పార్టీల అలయెన్స్ 'ఇండియా' మీటింగ్ జులై 18న బెంగళూరులో జరిగింది. అయితే వీవీఐపీల రాకతో నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అప్పుడే ఓ ఏసీపీ చేసిన పని అందరితో శభాష్ అనిపించుకునేలా చేసింది. వివరాలిలా ఉన్నాయ్.. వీవీఐపీల రాకతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇదే సమయంలో రూట్నంబర్ 330లో బస్సు నడుపుతున్న బీఎంటీసీ బస్సు డ్రైవర్ తీవ్ర అస్వస్థకు గురయ్యారు.
అప్పటికే చాలా ట్రాఫిక్ ఉండటంతో బస్సును అతను రోడ్డు పక్కన నిలిపాడు. ఇది గమనించిన ఏసీపీ బి.రామచంద్ర చాకచక్యంగా ఆలోచించారు. అస్వస్థతకు గురైన డ్రైవర్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ మధ్యలో బస్సు ఆగడంతో దానిని నడిపేందుకు ఆయన రంగంలోకి దిగారు. ఆయనే స్వయంగా కిలోమీటర్ కు పైగా బస్సును నడిపి బస్సు షెల్టర్ వద్ద సెఫ్గా పార్క్ చేశారు. దీంతో ట్రాఫిక్ క్లియర్అయింది.
అత్యవసర సమయాల్లో చాకచక్యంగా వ్యవహరించడమే కాకుండా.. విధుల్లో తన నిబద్ధతను చాటుకున్న ఏసీపీపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇలాంటి వారే దేశాభివృద్ధికి దోహదపడతారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.