మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం: 30 అడుగుల బ్రిడ్జ్ పైనుంచి కిందపడిన స్లీపర్ బస్సు.. సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ మృతి!

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం: 30 అడుగుల బ్రిడ్జ్ పైనుంచి కిందపడిన స్లీపర్ బస్సు.. సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ మృతి!

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో భోపాల్ బైపాస్‌పై ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సు అదుపుతప్పి వంతెనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న బెంగళూరు సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్‌తో పాటు నలుగురు పోలీసులు  ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.

బెంగళూరులోని సౌత్ ఈస్ట్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న రవి  మరికొందరు పోలీసులు కలిసి ఒక సైబర్ క్రైమ్ కేసు విచారణ నిమిత్తం అనుమానితుడి కోసం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రవితో పాటు ప్రయాణించిన మిగతా పోలీసులంతా క్షేమంగా ఉన్నట్లు సమాచారం.

ప్రమాదం ఎలా జరిగింది?

తెల్లవారుజామున బియోరా నగరంలోని బైపాస్ వంతెనపై వెళ్తుండగా బస్సు అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు ఇన్‌స్పెక్టర్ రవితో సహా మరికొందరు ప్రయాణికులు సుమారు 30 అడుగుల ఎత్తైన వంతెన పైనుంచి కిందపడిపోయారు. వారికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

క్షతగాత్రుల పరిస్థితి:
ఈ ప్రమాదంలో గాయపడిన 11 మందిని స్థానికులు, పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా, వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.