- బ్యాంక్ లావాదేవీల ఆధారంగా విచారించి అదుపులోకి..
భద్రాచలం,వెలుగు : భద్రాచలం సబ్రిజిస్ట్రార్షేక్ఖదీర్ ను ఏసీబీ అరెస్ట్ చేసింది. గురువారం భద్రాచలంలోని ఐటీడీఏ ఆవరణలోని సబ్ రిజిస్ట్రార్ఆఫీసులో డీఎస్పీ వై.రమేశ్ ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు. గతంలో బూర్గంపాడు సబ్ రిజిస్ట్రార్ గా చేసేటప్పుడు షేక్ ఖదీర్పై తీవ్ర అవినీతి, ఆరోపణలపై ప్రజల నుంచి ఫిర్యాదులు వెళ్లాయి.
దీంతో గతేడాది జూన్ లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు చేసింది. అనంతరం సబ్ రిజిస్ట్రార్ ఖదీర్ బ్యాంకు లావాదేవీలపై నిఘా పెట్టింది. బ్యాంకు స్టేట్మెంట్ఆధారంగా భారీగా మనీ ట్రాన్స్ ఫర్ అయినట్టు, కొందరు సిబ్బంది అకౌంట్ల ద్వారా కూడా నగదు వెళ్లినట్టు ఏసీబీ గుర్తించింది.
ప్రస్తుతం భద్రాచలం సబ్రిజిస్ట్రార్ గా ఖదీర్ ఉండగా.. అక్కడికి ఏసీబీ వెళ్లింది. బ్యాంకు స్టేట్ మెంట్ ద్వారా ఆయనను అదుపులోకి తీసుకుని విచారించి పూర్తి వివరాలు రాబట్టిన అనంతరం అరెస్ట్ చేసింది. ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీకి కంప్లయింట్ చేయాలని డీఎస్పీ వై.రమేశ్ సూచించారు.
