హైదరాబాద్ సిటీ, వెలుగు: మొయినాబాద్లోని ఆజాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న నీరటి వెంకటేశ్వరరావుకు తమిళనాడుకు చెందిన అన్నామలై యూనివర్సిటీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో డాక్టరేట్ ప్రదానం చేసింది. ‘టెక్నాలజీ అడాప్షన్ ఎమాంగ్ కన్సూ్యమర్స్ ఇన్ ఎంటర్టైన్మెంట్ మీడియా బిజినెస్ ఇన్ తెలంగాణ స్టేట్’ అనే అంశంపై ఆయన చేసిన పరిశోధన గ్రంథానికి గాను విశ్వవిద్యాలయం ఈ గౌరవాన్ని అందజేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన వెంకటేశ్వరరావుకు డాక్టరేట్ లభించడంతో సహచర అధ్యాపకులు, బంధుమిత్రులు అభినందించారు. వినోద మాధ్యమాల్లో జరిగే వ్యాపార పోకడలను అర్థం చేసుకోవడానికి ఈ సిద్ధాంత గ్రంథం ఎంతగానో తోడ్పడుతుందన్నారు.
