సీహెచ్ సీలో భద్రాద్రి కలెక్టర్ సతీమణి డెలివరీ .. అభినందించిన పలువురు జిల్లా అధికారులు

సీహెచ్ సీలో భద్రాద్రి కలెక్టర్ సతీమణి డెలివరీ .. అభినందించిన పలువురు జిల్లా అధికారులు

పాల్వంచ, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్  వి పాటిల్ సతీమణి శ్రద్ధ పాల్వంచ కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్ సీ)లో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ప్రెగ్నెన్సీ అయినప్పటినుంచి అదే ఆస్పత్రిలో రెగ్యులర్ గా వైద్య పరీక్షలు చేయించుకుంటూ డాక్టర్ల ఆరోగ్య సూచనలు పాటించారు. పురుటి నొప్పులు రావడంతో బుధవారం ఆస్పత్రికి తీసుకెళ్లగా సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో సిజేరియన్ ద్వారా ఆమెకు డెలివరీ చేశారు. పుట్టిన బాబు 3.200 గ్రాములు బరువు ఉన్నాడు. 

సమాచారం అందిన వెంటనే  కలెక్టర్ హెల్త్ సెంటర్ కు వెళ్లి బిడ్డను చేతుల్లోకి తీసుకుని మురిసిపోయారు. డాక్టర్ల బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే కలెక్టర్ కు ఆరేండ్లు బాబు ఉండగా, రెండో సంతానంగా  బాబు పుట్టారు. రెండు కాన్పుల్లోను సిజేరియన్ ద్వారానే ఆమె ప్రసవించారు. సర్కార్ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెంచేందుకు కలెక్టర్ పాటిల్ తీరును మెచ్చుకుంటూ పలువురు జిల్లా అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.