భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లాలో గంజాయి హాట్స్పాట్స్పై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టాలని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ బి.రోహిత్ రాజు పేర్కొన్నారు. హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్ క్వార్టర్లో శుక్రవారం నిర్వహించిన క్రైం రివ్యూ మీటింగ్లో ఆయన మాట్లాడారు. గంజాయి విక్రయించే వారితోపాటు సేవించే వారిపై నిఘా పెట్టి, కేసులు నమోదు చేయాలన్నారు.
అనుమానితులకు గంజాయి ర్యాపిడ్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించి, పాజిటివ్ వస్తే చర్యలు తీసుకోవాలన్నారు. కేసుల్లో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నేరస్థులకు శిక్ష పడే విధంగా పోలీసు అధికారులు కృషి చేయాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు, సీఐలు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్లో మోటార్ ట్రాన్స్పోర్టు వర్క్ షాప్లో కొత్తగా ఏర్పాటు చేసిన హైడ్రాలిక్ వెహికల్ లిఫ్టర్ను ఎస్పీ ప్రారంభించారు.
