భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ప్రీ ఫైనల్ఎగ్జామ్స్ ఫలితాల ఆధారంగా చదువులో వెనకబడిన పదోతరగతి విద్యార్థుల వివరాలను రెండు రోజుల్లోగా ఇవ్వాలని కలెక్టర్ జితేశ్వి.పాటిల్ ఆదేశించారు. బుధవారం విద్యాశాఖ అధికారులు, హెచ్ఎంలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. చదువులో వెనకబడిన విద్యార్థుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని చెప్పారు. బాలికలతో పోలిస్తే బాలుర ఉత్తీర్ణతా శాతం తక్కువగా ఉంటోందని, ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఎగ్జామ్స్కు ముందే అన్ని పాఠశాలల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలికలకు టాయ్లెట్స్లేని స్కూల్స్ఉండొద్దన్నారు. జిల్లాలో 30 ఏండ్లలోపు నిరుద్యోగ యువతను గుర్తించి నైపుణ్య శిక్షణనిచ్చేందుకు చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
