వరంగల్ సిటీ, వెలుగు : వరంగల్ భద్రకాళి ఆలయ ఇంటి దొంగలు సస్పెండ్ అయ్యారు. కొన్నేండ్లుగా దేవాదాయ శాఖకు చెందిన ఉద్యోగులు నరేందర్, శరత్కుమార్ఆలయ కౌంటర్వద్ద డూప్లికేట్టికెట్లు భక్తులకు అమ్ముతున్నారు. వచ్చిన ఆదాయాన్ని ఇద్దరు పంచుకుంటున్నారు. ఆలయ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇంటిదొంగలపై దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్రామాల సునీతకు ఐదు రోజుల కింద సమాచారం అందింది.
దీంతో ఉద్యోగులపై ఆమె ప్రత్యేక నిఘా పెట్టింది. కౌంటర్ లో డూప్లికేట్ టికెట్లు అమ్ముతుండగా ఇద్దరు ఉద్యోగులను పట్టుకుని మంగళవారం సస్పెండ్ చేసింది. విచారణలో మరిన్ని ఆధారాలను తీసుకుని ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.

