మోహన్ లాల్ మూవీతో భాగ్యశ్రీ బోర్సే మాలీవుడ్ ఎంట్రీ

మోహన్ లాల్ మూవీతో భాగ్యశ్రీ బోర్సే మాలీవుడ్ ఎంట్రీ

ఔరంగాబాద్‌‌‌‌‌‌‌‌ తర్వాత హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ తన సెకండ్‌‌‌‌‌‌‌‌ హోమ్ అని చెబుతున్న  హీరోయిన్‌‌‌‌‌‌‌‌ భాగ్యశ్రీ బోర్సే..  ఓవైపు తెలుగులో వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు ఇతర భాషల్లోనూ బిజీ అవుతోంది. ప్రస్తుతం ‘లెనిన్‌‌‌‌‌‌‌‌’ మూవీ ప్రమోషన్స్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఆమె.. తాజాగా ఓ మలయాళ సినిమాకు కమిట్ అయినట్టు తెలుస్తోంది. మోహన్ లాల్ హీరోగా విష్ణు మోహన్ దర్శకత్వంలో ఓ సర్వైవల్‌‌‌‌‌‌‌‌ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూపొందుతోంది. లాల్ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది 367వ చిత్రం. 

ఈ  సినిమాతోనే భాగ్యశ్రీ మాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్టు సమాచారం.  రష్యాతోఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌ యుద్ధంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయ పౌరులను కాపాడేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన సీక్రెట్ మిషన్‌‌‌‌‌‌‌‌ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ గంగ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. ఈ దేశభక్తి సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కీలకపాత్రను పోషించనుందట. 

ఆగస్టు ఫస్ట్ వీక్‌‌‌‌‌‌‌‌లో జార్జియాలో ఈ మూవీ షూటింగ్‌‌‌‌‌‌‌‌ స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేయబోతున్నట్టు తెలుస్తోంది.  మరోవైపు కమల్ హాసన్‌‌‌‌‌‌‌‌ నిర్మిస్తున్న తమిళ చిత్రం ‘సియోన్‌‌‌‌‌‌‌‌’లో ఆమె శివకార్తికేయన్‌‌‌‌‌‌‌‌కు జంటగా నటిస్తోంది. ఇక అఖిల్‌‌‌‌‌‌‌‌కు జంటగా భాగ్యశ్రీ నటించిన ‘లెనిన్‌‌‌‌‌‌‌‌’ చిత్రం జులై 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది.