కేసీఆర్.. నిరుద్యోగుల ఉసురు తగుల్తది : బండి సంజయ్

కేసీఆర్.. నిరుద్యోగుల ఉసురు తగుల్తది : బండి సంజయ్

డీజీపీ కార్యాలయం ముట్టడిలో బీజేవైఎం నేతలు, కార్యకర్తలు తీవ్రంగా గాయపడటంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తే అమానుషంగా వ్యవహరిస్తారా అని ప్రశ్నించిన ఆయన కేసీఆర్ సర్కారుకు పోయే కాలం వచ్చిందని అన్నారు. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు మద్దతుగా ఆందోళన చేపట్టిన వారి పట్ల పోలీసులు రాక్షసంగా వ్యవహించారని మండిపడ్డారు. 

ఇదిలా ఉంటే పోలీసుల కారణంగా తీవ్రంగా గాయపడ్డ బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్ భాను ప్రకాశ్ కు ఐసీయూలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కరీంనగర్ పర్యటనలో ఉన్న బండి సంజయ్ కు విషయం తెలియడంతో ఫోన్ చేసి అతని ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించడం చేతగాని కేసీఆర్ .. సర్కారును ప్రశ్నించే వాళ్లను అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నారని బండి మండిపడ్డారు. కేసీఆర్ కు నిరుద్యోగుల ఉసురు తగులుతుందని అన్నారు.