నేడు 2047 విజన్ డాక్యుమెంట్ ఫైనల్

నేడు 2047 విజన్ డాక్యుమెంట్ ఫైనల్
  •     తెలుగు, ఇంగ్లిష్,ఉర్దూ భాషల్లో తయారీ 
  •     కవర్ పేజీలో భారత్ ఫ్యూచర్ సిటీ ఫొటో

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రైజింగ్​ 2047 విజన్​ డాక్యుమెంట్   మూడు భాషల్లో సిద్ధమవుతోంది. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో ఈ డాక్యుమెంట్ ను ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన సాఫ్ట్  కాపీలను త్వరలో ప్రభుత్వ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్లలో అప్ లోడ్  చేయనున్నారు. ఇప్పటికే శాఖల వారీగా విజన్​ రిపోర్టులను హెచ్ఓడీలు పంపగా.. సీఎస్​ నేతృత్వంలో అధికారుల బృందం వాటికి తుదిరూపు దిద్దుతున్నది.  

శనివారం సాయంత్రంలోపు ఫైనల్​ చేయనున్నారు.  ఈ నెల 8, 9వ తేదీల్లో భారత్​ ఫ్యూచర్​ సిటీలో  జరగనున్న  గ్లోబల్​ సమిట్​లో విజన్​ డాక్యుమెంట్​ను ఆవిష్కరించనున్నారు. సుమారు వెయ్యి మంది ప్రతినిధులకు ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

 వివిధ రంగాల, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు  పాల్గొనే ఈ సమ్మిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విజన్  డాక్యుమెంట్  ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.దీని కవర్  పేజీలో భారత్  ఫ్యూచర్ సిటీ ఫొటో పెడుతున్నారు.