ఇవాళ ముగియనున్న భారత్ జోడో యాత్ర

ఇవాళ ముగియనున్న భారత్ జోడో యాత్ర

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇవాళ్టితో ముగియనుంది. ఉదయం 10 గంటలకు పంథా చౌక్ శ్రీనగర్ నుండి రాహుల్ పాదయాత్ర ప్రారంభమైంది. నేటితో ఈ యాత్ర 135 రోజులకి చేరుకుంది. కాసేపట్లో శ్రీనగర్ లాల్ చౌక్ కు రాహుల్ యాత్ర చేరుకోనుంది. అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించి ఆయన యాత్రను ముగిస్తారు. కాగా, సోమవారం ఉదయం 10 గంటలకు శ్రీనగర్ లో భారత్ జోడో యాత్ర ముగింపు సభ నిర్వహించనున్నారు. 

శ్రీనగర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభకు రావాలని 21 ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానం పంపారు. ముగింపు సభకు వచ్చిన నేతలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శ్రీనగర్ లోని హోటల్ తాజ్ వివంతలో విందు ఇవ్వనున్నారు. ఇక 2022 సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్ర మొదలై కశ్మీర్ వరకు చేరింది. మొత్తం 3,570 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగింది.