సూర్య తేజ ఏలే, మీనాక్షి గోస్వామి జంటగా ‘దొరసాని’ ఫేమ్ కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో పాయల్ సరాఫ్ నిర్మించిన చిత్రం ‘భరతనాట్యం’. ఏప్రిల్ 5న సినిమా విడుదల కానుంది. శనివారం ఈ మూవీ ట్రైలర్ను రైటర్ కోన వెంకట్ రిలీజ్ చేసి టీమ్కు బెస్ట్ విషెస్ చెప్పాడు. ఈ సందర్భంగా సూర్య తేజ మాట్లాడుతూ ‘ఇదొక క్రైమ్ కామెడీ. ట్రైలర్లో ఉండే ఎనర్జీ థియేటర్స్లో ఉంటుంది.
ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పాడు. కామెడీ, థ్రిల్ , డ్యాన్స్, ఫ్యామిలీ, లవ్ డ్రామా అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయని చెప్పింది హీరోయిన్ మీనాక్షి గోస్వామి. కేవీఆర్ మహేంద్ర మాట్లాడుతూ ‘ కథలో చాలా బలం ఉంది. మంచి డ్రామా ఉంటుంది. ఇందులో ఉండే పాత్రలన్నీ కొత్తగా ఉంటాయి. నలభై నిమిషాల పాటు కడుపుబ్బానవ్వించే సీక్వెన్స్లు ఉంటాయి. నిర్మాతలు చాలా సపోర్ట్ చేశారు’ అని చెప్పాడు. సినిమా సక్సెస్పై కాన్ఫిడెంట్గా ఉన్నామని నిర్మాత పాయల్ సరాఫ్ చెప్పారు.