
కమల్ హాసన్, శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న క్రేజీ ప్రాజెక్టు ‘భారతీయుడు 2’. ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత సీక్వెల్గా వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. జులై 12న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరల్డ్వైడ్గా విడుదల కానుంది. జూన్ 25న ట్రైలర్ను రిలీజ్ చేస్తున్నట్టు ఆదివారం ప్రకటించారు. ఇందులో కమల్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడే స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతిగా పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.
కాజల్, రకుల్ ప్రీత్సింగ్ హీరోయిన్స్. సిద్ధార్థ్, ఎస్జే సూర్య, బాబీ సింహా, మనోబాల, బ్రహ్మానందం, సముద్రఖని ఇతర పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ సంస్థలు కలిసి భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి, సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి.