రాష్ట్ర ప్రభుత్వం తూతూ మంత్రంగా బడ్జెట్ సమావేశాలు జరపాలని ప్రయత్నిస్తోందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. గవర్నర్ ప్రసంగం లేకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. సభ ప్రొరోగ్ జరగలేదని చెప్పడం.. సంప్రదాయానికి పూర్తి విరుద్ధమన్నారు. ఇన్ని రోజులుగా ప్రొరోగ్ చేయలేదు అనటం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. గవర్నర్ ప్రసంగం లేకపోవడంతో ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనన్నారు భట్టి. గవర్నర్ కు ధన్యవాదాలు చెప్పే సందర్భంగా .. ప్రభుత్వ విధానాలను ఎండగట్టే అవకాశం ఉండేదన్నారు.
మరిన్ని వార్తల కోసం
ఈ వ్యాధి వస్తే శాశ్వతంగా కంటి చూపు కోల్పోయే ప్రమాదం
వైభవంగా జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు