ఈ వ్యాధి వస్తే శాశ్వతంగా కంటి చూపు  కోల్పోయే ప్రమాదం

ఈ వ్యాధి వస్తే శాశ్వతంగా కంటి చూపు  కోల్పోయే ప్రమాదం

గ్లకోమా  వ్యాధిపై  ప్రజలకు అవగాహన  కల్పించి  చైతన్యం తీసుకురావాలన్నారు  మంత్రి హరీశ్ రావు.  అవగాహన లేక  ఈ వ్యాధిని  గుర్తించలేకపోతున్నారని  తెలిపారు. వరల్డ్   గ్లకోమా డే సందర్భంగా  సరోజినీ దేవి   ఐ హాస్పిటల్ లో  వరల్డ్ గ్లాకోమా  వారోత్సవాలు  నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి   మంత్రి హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీపీ షుగర్  ఉన్న వారికి, అలాగే  పని ఒత్తిడి  ఉన్న వారిలో  ఈ వ్యాధి ఎక్కువగా  కనిపిస్తుందని మంత్రి  హరీశ్ తెలిపారు. ఈ వ్యాధి వస్తే శాశ్వతంగా కంటి చూపు  కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.  ప్రతి సంవత్సరం  ఒకసారి కంటి  పరీక్షలు చేయించుకోవాలన్నారు . రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ   కంటి పరీక్ష చేసిన  ఘనత  కేసీఆర్ కే   దక్కుతుందన్నారు. కేవలం ఐదు నెలల్లో కోటి  యాభై లక్షల మందికి  కంటి  పరీక్షలు  చేసి.. 40 లక్షల  మందికి ఉచితంగా  కళ్ళజోడు అందించారన్నారు. 

ఈ కిచెన్ లో రోజుకు 18 వేల మందికి వంట చేయొచ్చు