లైన్ క్లియర్​.. భువనగిరి ఎంపీ టికెట్ భిక్షమయ్య గౌడ్​కే ?

 లైన్ క్లియర్​..  భువనగిరి ఎంపీ టికెట్ భిక్షమయ్య గౌడ్​కే ?
  • భువనగిరి ఎంపీ టికెట్ భిక్షమయ్య గౌడ్​కే ?
  • కేటీఆర్​ భరోసా ఇచ్చినట్టు ప్రచారం  
  • కుంభం వెళ్లిపోవడంతో లైన్ క్లియర్​  

యాదాద్రి, వెలుగు : కుంభం అనిల్​ కుమార్​రెడ్డి బీఆర్ఎస్​ నుంచి తిరిగి కాంగ్రెస్​లో చేరడం బూడిద భిక్షమయ్య గౌడ్​కు కలిసివచ్చింది. ఆయనకు భువనగిరి నుంచి బీఆర్ఎస్​ఎంపీ టికెట్​కన్ఫర్మ్​అయినట్టు ఆయన సన్నిహితులు సంబరపడుతున్నారు. తనను కలిసిన భిక్షమయ్యకు నియోజకవర్గంలో పని చేసుకోవాలని మంత్రి, పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ భరోసా ఇచ్చారని చెప్తున్నారు.  బీఆర్ఎస్​ నుంచి బీజేపీలోకి వెళ్లిన భిక్షమయ్య కొంతకాలం కింద తిరిగి బీఆర్ఎస్ లోకి వచ్చారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి గానీ, ఎంపీ టికెట్​గానీ ఇస్తామని హైకమాండ్​ చెప్పినట్టు ప్రచారం జరిగింది. 

ఇంతలోనే కాంగ్రెస్​ నుంచి వచ్చిన కుంభంకు ఎంపీ టికెట్​ఆఫర్​ చేయడం, గవర్నర్​ కోటాలో శ్రవణ్, సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించడంతో ఆయన వర్గం నిరాశ చెందింది. తాజాగా కుంభం అనిల్​కుమార్​ రెడ్డి కాంగ్రెస్​కు వెళ్లడంతో భువనగిరి లోక్​సభ స్థానం నుంచి  భిక్షమయ్యకు అవకాశం కల్పించాలని బీఆర్ఎస్​ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయం స్వయంగా కేటీఆరే చెప్పారని భిక్షమయ్య అనుచరవర్గం సంతోషంలో మునిగిపోయింది.