గోపీచంద్ హీరోగా కన్నడ దర్శకుడు హర్ష రూపొందించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘భీమా’. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్గా నటించారు. కె.కె.రాధామోహన్ నిర్మాత. మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో హన్మకొండలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పద్మశ్రీ గడ్డం సమ్మయ్య అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ అవ్వాలని విష్ చేశారు.
గోపీచంద్ మాట్లాడుతూ ‘ఈ సినిమా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. ప్రతి సీన్ చాలా బాగుంటుంది. ప్రేక్షకులను కేక పుట్టిస్తుంది అనడంలో సందేహం లేదు. మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ నెక్స్ట్ లెవల్ మ్యూజిక్ ఇచ్చారు. రామ్ లక్ష్మణ్, వెంకట్, రవి వర్మ ఎక్స్ట్రార్డినరీ ఫైట్ సీక్వెన్స్ ఇచ్చారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ ఫైట్స్ గొప్పగా అలరిస్తాయి. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అని చెప్పాడు. ఇందులో విద్య అనే మంచి పాత్రని ఇచ్చిన దర్శకుడు హర్షకి థ్యాంక్స్ అని చెప్పింది మాళవిక శర్మ.
దర్శకుడు హర్ష మాట్లాడుతూ ‘‘భీమా’లో ఎనర్జీ పవర్ ఉంది, ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. గోపీచంద్ చాలా హంబుల్గా ఉంటారు. థియేటర్స్లో హై ఇంపాక్ట్ ఇచ్చే సినిమా ఇది. వందశాతం ఎంటర్టైన్ చేస్తుంది’ అని అన్నాడు. అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని నమ్ముతున్నా అన్నారు నిర్మాత రాధామోహన్. డైలాగ్ రైటర్ అజ్జు మహంకాళి, రఘు, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, కళ్యాణ్ చక్రవర్తితో పాటు టీమ్ అంతా పాల్గొన్నారు.