
చౌటుప్పల్, వెలుగు : వ్యవసాయ చట్టాలు.. రైతులకు చుట్టాలు కావాలని రాష్ట్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ చైర్మన్ కోదండరెడ్డి, కమిషన్ సభ్యుడు సునీల్ అన్నారు. శనివారం భూదాన్ పోచంపల్లి, చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో లిప్ సంస్థ ఆధ్వర్యంలో సాగు న్యాయయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు సాగు చట్టాలపై అవగాహన కల్పించడం కోసం ఈ న్యాయ యాత్ర చేపట్టినట్లు తెలిపారు.
పంట యాజమాన్య పద్ధతులు, నాణ్యమైన విత్తనాలు, సేంద్రియ వ్యవసాయంపై శాస్త్ర వేత్తలు ఇప్పటికే రైతులకు అవగాహన కల్పించారని చెప్పారు. సరైన సమయంలో ప్రభుత్వం రైతు భరోసా అందించడం వల్ల రైతులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో చౌటుప్పల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటయ్య, వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, డైరెక్టర్లు, అధికారులు, రైతులుపాల్గొన్నారు.