హెచ్డీ కాటన్ సీడ్స్ అమ్మితే కేసులు

హెచ్డీ కాటన్ సీడ్స్ అమ్మితే కేసులు

యాదాద్రి, వెలుగు: నిషేధించిన హెచ్​డీ కాటన్​ విత్తనాలు, కల్తీ ఎరువులు అమ్మితే కేసులు నమోదు చేస్తామని యాదాద్రి అడిషినల్​ కలెక్టర్​ వెంకారెడ్డి హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్​లో నిర్వహించిన విత్తనాలు, ఎరువుల డీలర్ల మీటింగ్​లో ఆయన మాట్లాడారు. యాప్​ ద్వారానే యూరియా బుకింగ్​ చేసుకున్న రైతులకే అమ్మాలని సూచించారు.

నానో యూరియాను ఉపయోగించే విధంగా రైతులను డీలర్లు అవగాహన కల్పించాలన్నారు. అతిగా యూరియా వాడడం వల్ల క్యాన్సర్​ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఈ విషయాన్ని రైతులకు వివరించి యూరియా వాడకం తగ్గించే విధంగా చూడాలన్నారు. మీటింగ్​లో డీఏవో వెంకట రమణారెడ్డి, ఏడీఏ నీలిమ ఉన్నారు.