భూపాలపల్లి కి మహర్దశ.. పట్టణాభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్

భూపాలపల్లి కి మహర్దశ..  పట్టణాభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్
  • పనుల కోసం రూ.50 కోట్ల మంజూరు
  • జంక్షన్ల వెడల్పుతో ట్రాఫిక్​ సమస్యలకు చెక్​

జయశంకర్​భూపాలపల్లి, వెలుగు: భూపాలపల్లి పట్టణానికి మహర్దశ పట్టనుంది. అభివృద్ధి పనుల కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులకు ​అడ్మినిస్ర్టేటివ్​ సాంక్షన్​ రాగా, ఆఫీసర్లు డీపీఆర్​ పనుల్లో నిమగ్నమయ్యారు. టెండర్లు పిలిచి పనులు స్పీడప్​ చేయనున్నారు. 

రూ.50 కోట్లతో డెవలప్..

పట్టణ ప్రజలకు మెరుగైన వసతుల కల్పనే లక్ష్యంగా సీఎం రేవంత్​రెడ్డి భూపాలపల్లి మున్సిపాలిటీకి నిధులు మంజూరు చేశారు. ఇటీవల రూ.50కోట్లు కేటాయించగా, గతంలో ప్రారంభించి పెండింగ్​లో ఉన్న పనులతోపాటు ఇతర అభివృద్ధి పనులను పూర్తి చేయనున్నారు. ఇందులో భాగంగా రూ.4 కోట్లతో అసంపూర్తిగా ఉన్న ఆడిటోరియం నిర్మాణ పనులు పూర్తి చేయనున్నారు.

 నిలిచిపోయిన మంజూర్​ నగర్​ ఇంటిగ్రేటెడ్​ వెజ్, నాన్​వెజ్​ మార్కెట్​ పనుల కోసం రూ.6 కోట్లు, రూ.30 కోట్లతో జయశంకర్​ విగ్రహం, జంగేడ్​ రోడ్, అటవీశాఖ ఆఫీస్, అంబేద్కర్​ జంక్షన్​ రెండు వైపుల షాపింగ్​ కాంప్లెక్స్​ల నిర్మాణం, 5 ఇంక్లైయిన్​ జంక్షన్​ సమీపంలో అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ భవనానికి రూ.2 కోట్లు, జంగేడు వైకుంఠధామానికి రూ.50 లక్షలు, కోల్​ లోడింగ్, ఆన్​లోడింగ్​ లేబర్​యూనియన్​ భవన నిర్మాణానికి రూ.50 లక్షలు, రూ.2 కోట్లతో పెద్దకుంటపల్లిలో సీసీ రోడ్, సైడ్​డ్రైన్ల నిర్మాణం, రూ.5 కోట్లతో అంబేద్కర్​ భవనం నిర్మాణం చేపట్టేవిధంగా నిధులు కేటాయించారు. ఆయా పనులు టెండర్​ ప్రక్రియ ముగియగానే మార్చినాటికి పూర్తి చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. 

జంక్షన్ల వెడల్పుతో ట్రాఫిక్​సమస్యకు చెక్..

భూపాలపల్లి పట్టణంలోని ఇరుకుగా ఉన్న జంక్షన్ల వద్ద పెద్ద వాహనాలు టర్న్ అయ్యే క్రమంలో ప్రమాదాలు జరిగి ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలూ ఉన్నాయి. దీంతో పట్టణంలోని ప్రధానంగా జంక్షన్లను వెడల్పు పనులు చేపట్టనున్నారు. బస్టాండ్​ ఎంట్రీ, ఎగ్జిట్​ అంబేద్కర్​ జంక్షన్​ రూ.5 కోట్లతో వెడల్పు చేయడంతోపాటు అంబేద్కర్​ జంక్షన్ నుంచి ఓసీ జంక్షన్​ వరకు బీటీ రోడ్డు, సైడ్​ డ్రైన్, సెంట్రల్ లైటింగ్​ ఏర్పాటు చేయనున్నారు.

 గండ్రపల్లి జంక్షన్ నుంచి మహబూబ్​పల్లి క్రాస్ వరకు రూ.3 కోట్లతో బీటీ రోడ్డు, సైడ్​డ్రైన్, సెంట్రల్ లైటింగ్, రూ.4 కోట్లతో మీనీ స్టేడియం నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే మున్సిపాలిటీ పరిధిలో టీయూఎఫ్​ఐడీసీ నిధులు రూ.30 కోట్లతో డెవలప్​మెంట్ పనులు కొనసాగుతున్నాయి. 

సుందరీకరణపై నజర్..​

జిల్లా కేంద్రం శివారు వరకు ఉన్న జాతీయ రహదారి వెంట సుందరీకరణ పనులు చేపట్టేందుకు అధికారులు ప్లాన్​​ చేశారు. ప్రధాన జంక్షన్ల వద్ద ఆకర్షించే విధంగా లైటింగ్, వాటర్​ఫాల్స్, ఆకర్షించే పూల చెట్లతోపాటు, ఆహ్లాదాన్ని పంచే పెయింటింగ్స్​ఏర్పాటుతో పట్టణానికి కొత్త హంగులు కల్పించనున్నారు. 

సీఎం రేవంత్​రెడ్డికి కృతజ్ఞతలు.. 

పట్టణాభివృద్దికి రూ.50 కోట్లు కేటాయించడంతో అభివృద్ధి స్పీడప్​ కానున్నది. పెండింగ్ పనులతోపాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త నిర్మాణాలు చేపట్టి మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే అమృత్ స్కీం ద్వారా రూ.23 కోట్లతో  డెవలప్​మెంట్​ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. టెండర్ల ప్రక్రియ పూర్తి కాగానే అన్ని పనులు త్వరగా పూర్తి చేసేలా చూస్తాం. - గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్యే భూపాలపల్లి