గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణం

గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణం

గుజరాత్ సీఎంగా రెండోసారి భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ , భూపేంద్ర పటేల్ తో  ప్రమాణం చేయించారు. వీరితో పాటు 16 మంది ఎమ్మెల్యేలు  మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రధాని మోడీ, అమిత్ షా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. యూపీ సీఎం యోగి  ఆదిత్యనాథ్, కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్,  కేంద్రమంత్రి  రాజ్ నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, త్రిపుర రాష్ట్రాల సీఎంలు, స్మృతి ఇరాని, పలువురు బీజేపీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ నెల 1, 5 తేదీల్లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించింది. 182 స్థానాల్లో పోటీ చేసి 156 సీట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 17, ఆప్ 5 స్థానాలు గెలుచుకుంది. దీంతో భూపేంద్ర పటేల్ ఇవాళ రాష్ట్ర 18వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.