కాంగ్రెస్​తోనే అన్ని వర్గాలకు న్యాయం : అనిల్‌‌‌‌‌‌‌‌ కుమార్ రెడ్డి

కాంగ్రెస్​తోనే అన్ని వర్గాలకు న్యాయం : అనిల్‌‌‌‌‌‌‌‌ కుమార్ రెడ్డి

యాదాద్రి, వెలుగు : కాంగ్రెస్​అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆ పార్టీ భువనగిరి అభ్యర్థి కుంభం అనిల్​కుమార్​ రెడ్డి అన్నారు.  మంగళవారం వలిగొండ, భువనగిరిలో ఇంటింటి  ప్రచారం నిర్వహించారు.  ఈ సందర్భంగా కాంగ్రెస్​ ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీని ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల చదువుల కోసం  వైఎస్​రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్​మెంట్​ స్కీమ్​కు బీఆర్​ఎస్​ గండికొట్టిందని మండిపడ్డారు.  దీంతో విద్యార్థులను కాలేజీల యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నాయని వాపోయారు.  

ఉద్యోగావకాశాలు కల్పించడంలో బీఆర్​ఎస్​ ఫెయిల్‌‌‌‌‌‌‌‌ అయ్యిందని, నోటిఫికేషన్లు ఇచ్చినట్టే ఇచ్చి లీకేజీలతో నిరుద్యోగులను ఆగం చేసిందని ఆరోపించారు.  కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన  కాంగ్రెస్  అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం  చేశారు.  అనంతరం బీఆర్​ఎస్​కు చెందిన పలువురు కార్యకర్తలు కాంగ్రెస్​ చేరారు.  కాగా, కుంభం అనిల్​రెడ్డి కూతురు కీర్తి రెడ్డి భువనగిరిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.