
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన కుటుంబసభ్యులు ములాఖత్ అయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ...చంద్రబాబు ప్రజల హక్కులకోసమే పోరాడారని ఆయన సతీమణి భువనేశ్వరి అన్నారు. టీడీపీ పార్టీని తన తండ్రి ఎన్టీఆర్ స్థాపించారని... తెలుగుదేశం పార్టీ ఎక్కడకీ పోలేదు.. ప్రజలకోసం ఎప్పుడూ పోరాడుతుందని భువనేశ్వరి అన్నారు. ఆయన కట్టించిన జైల్లోనే బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది టీడీపీ క్యాడర్ కు.. తమ కుటుంబానికి చాలా కష్టసమయం అంటూ.. తన భర్త జైల్లో కూడా ప్రజల గురించే ఆలోచిస్తున్నారన్నారు. ఇప్పటి వరకు ఆయన జీవితాన్ని ప్రజల కోసమే ధారపోశారన్నారు. చంద్రబాబు భద్రత విషయంమై స్పందించిన ఆమె భయంగా ఉందన్నారు. తాను బయటకు వచ్చేటప్పుడు అక్కడ ఏదో వదలిపెట్టి వచ్చానని ఆమె అన్నారు. తన భర్త ఎప్పుడు కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వలేదని.... ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించే ఆలోచించేవారని భువనేశ్వరి అన్నారు.