వాషింగ్టన్: వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ జమాల్ ఖషోగీ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నా, సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ ఆ దేశానికి ప్రధానిగా నియమితులవడంతో ఆయనపై వీసా బ్యాన్ ను ఎత్తేశామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. గతంలో ప్రధాని నరేంద్ర మోడీపైనా ఇలాగే బ్యాన్ను ఎత్తేశామని వివరణ ఇచ్చింది. సౌదీకి చెందిన జమాల్ ఖషోగీ ఇస్తాంబుల్లోని సౌదీ కాన్సులేట్లో 2018లో హత్యకు గురయ్యారు.
సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఆదేశాలతోనే ఈ హత్య జరిగిందని ఖషోగీ భార్య కేసు పెట్టారు. ఈ కేసు సంచలనంగా మారడంతో సల్మాన్పై అమెరికా వీసా బ్యాన్ ప్రకటించింది. ఇటీవల ఆయన సౌదీ ప్రధానిగా నియమితులవడంతో బ్యాన్ను ఎత్తేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ కోర్టుకు తెలిపింది. దీనిపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థతో పాటు మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా విమర్శలు చేశాయి.