బకాయిలు చెల్లించలేదనే కారణంతో బీజేపీ ఎంపీ, బాలీవుడ్స్టార్నటుడు సన్నీ డియోల్ఆస్తుల వేళానికి సిద్ధపడిన బ్యాంకు తన నిర్ణయాన్ని 24 గంటల్లో వెనక్కి తీసుకుంది. సాంకేతిక కారణాల వల్ల నోటీసులు వెనక్కి తీసుకున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్లడించింది.
వివరాలు.. సన్నీడియోల్ 2022 డిసెంబర్ నుంచి జరిమానా, వడ్డీతో కలిపి మొత్తంగా రూ.55 కోట్ల 99 లక్షలు బ్యాంకుకు బాకీ పడ్డారు. ఇందుకు ప్రతిగా ముంబయిలోని జుహూ ప్రాంతంలో ఉన్న ఆయన విల్లాను రూ.51 కోట్ల 43 లక్షల రిజర్వ్ ధరకు ఆగస్టు 25న ఈ వేలం వేయనున్నట్లు బ్యాంక్ నోటీసులు జారీ చేసింది.
విల్లాలో పాటు ఆయన తండ్రి ధర్మేంద్ర కు చెందిన భవనాలు కూడా వేలం వేస్తున్నట్లు పేర్కొంది. నోటీస్ఇచ్చి 24 గంటలు గడవక ముందే వేలం నోటీసులు ఉపసంహరించుకోవడం చర్చనీయాంశం అయింది. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది.
బ్యాంకు పేర్కొన్న సాంకేతిక కారణాలను ఎవరు ప్రేరేపించారని ఆశ్చర్యపోతున్నారా?అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ బీజేపీని ఉద్దేశించి వ్యంగ్యంగా ట్వీట్చేశారు.