హైదరాబాద్ కావూరి హిల్స్లో ఉంటున్న పబ్లిక్కు బిగ్ రిలీఫ్ !

హైదరాబాద్ కావూరి హిల్స్లో ఉంటున్న పబ్లిక్కు బిగ్ రిలీఫ్ !
  • కావూరి హిల్స్లో మురుగు సమస్యకు చెక్!
  • క్షేత్రస్థాయిలో పర్యటించిన వాటర్ బోర్డు ఎండీ
  • శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశం

హైదరాబాద్​ సిటీ, వెలుగు: దుర్గం చెరువు సమీపంలోని కావూరి హిల్స్‌‌‌‌ వద్ద మురుగునీటి సమస్య పరిష్కారానికి మెట్రో వాటర్‌‌‌‌ బోర్డు చర్యలు చేపట్టింది. వర్షాల వల్ల సీవరేజ్‌‌‌‌ ఓవర్​ఫ్లో అవుతుండటంతో బోర్డు ఎండీ అశోక్‌‌‌‌ రెడ్డి సోమవారం ఆ ప్రాంతాన్ని సందర్శించి, అధికారులతో చర్చించారు. సీవరేజ్‌‌‌‌ లైన్​లను డి-సిల్టింగ్‌‌‌‌ చేయాలని, శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దుర్గం చెరువు ఎస్టీపీ వద్ద సీవరేజ్‌‌‌‌ అనుసంధానం, వర్షపు నీటి కాల్వలో మురుగు చేరకుండా చర్యలు, స్లూయిస్‌‌‌‌ వాల్వ్​ల పర్యవేక్షణకు సూచనలు ఇచ్చారు.

అలాగే దుర్గం చెరువు వద్ద ఉన్న 7 ఎంఎల్డీ సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ఆయన సందర్శించారు. మురుగునీటి శుద్ధి ప్రక్రియ, ఎస్టీపీ ఇన్​లెట్, అవుట్​లెట్​లను పరిశీలించారు. స్కాడా రూమ్​లో ఆన్‌‌‌‌లైన్ పర్యవేక్షణ వివరాలను తెలుసుకున్నారు. అన్ని ఎస్టీపీల పనితీరు, ఇన్‌‌‌‌ఫ్లో, శుద్ధి నీటి నాణ్యత వివరాలు ఎప్పటికప్పుడు తెలిసేలా ప్రధాన కార్యాలయంలో డాష్​బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.