తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'అఖండ 2: తాండవం'. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. అయితే డిసెంబర్ 4 రాత్రి 8 గంటలకు ప్రీమియర్ షోలను ప్రదర్శించాల్సి ఉంది. కానీ సాంకేతిక కారణాల వల్ల ఈ షోలను రద్దు చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ మూవీ విడుదల ఆరంభంలోనే అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది..
చివరి నిమిషంలో బిగ్ షాక్!
బాలయ్య అభిమానులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రీమియర్ షోల కోసం టికెట్ల పెంపుతో సహా ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంతో ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు. రాత్రి 8 గంటల నుంచి షోలు మొదలవుతాయని ప్రకటన వచ్చింది. చివరి నిమిషం వరకు టికెట్ బుకింగ్స్పై సరైన సమాచారం లేక ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేశారు. సరిగ్గా ప్రీమియర్స్ వేయాల్సిన సమయానికి కాసేపటి ముందు, కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఇవాళ రాత్రి జరగాల్సిన ప్రీమియర్ల షోలను రద్దు చేస్తున్నాం. షెడ్యూల్ ప్రకారం షోలు వేసేందుకు మేము చాలా ప్రయత్నించాం, కానీ కొన్ని మా చేతుల్లో లేకుండా పోయాయి. అసౌకర్యానికి క్షమించండి.. అంటూ 14 రీల్స్ ప్లస్ సంస్థ ట్వీట్ చేసింది.
►ALSO READ | Bigg Boss Telugu 9 : బిగ్బాస్ హౌస్లో 'ఫస్ట్ ఫైనలిస్ట్' రేస్ క్లైమాక్స్.. టాప్ 5 లెక్కలు గల్లంతు చేసిన రీతూ చౌదరి!
అయితే, ఓవర్సీస్లో మాత్రం ప్రీమియర్స్ యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేయడంతో, ఇండియాలోని ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఒకవైపు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అదనపు షోలకు కూడా వెసులుబాటు కల్పించింది. అయితే చివరి నిమిషంలో ప్రీమియర్స్ రద్దు చేయడం ఆందోళన రేపింది. దీంతో తీవ్ర నిరాశతో అభిమానులు థియేటర్ల నుంచి వెళ్లిపోయారు
#Akhanda2 Premieres in India scheduled for today are cancelled due to technical issues.
— 14 Reels Plus (@14ReelsPlus) December 4, 2025
We've tried our best, but a few things are beyond our control. Sorry for the inconvenience.
The overseas premieres will play as per the schedule today.
