
బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7) ఉల్టా పుల్టా అని హోస్ట్ నాగార్జున(Nagarjuna) ముందు నుండి చెప్పుకొస్తున్నారు. ఆ మాటకు జెస్టిఫికేషన్ గా ఆరోవారంలో అదిరిపోయే ట్విస్టు ఇచ్చాడు బిగ్ బాస్. ఇప్పటికే ఇంటి నుండి ఐదుగురు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఇక మిగిలింది తొమ్మది మంది. ఇందులో ఎవరో ఒకరు బిగ్ బాస్ విన్నర్ అవుతారని అనుకున్నారు హౌస్ మేట్స్ కానీ.. అనూహ్యంగా మరో ఐదురుగురు కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
అందులో.. అంబటి అర్జున్(Ambati Arjun), అశ్విని(Ashwini), భోలే షావలి(Bhole shavali), నయని పావని(Nayani pavani) మరియు పూజ(Pooja) ఉన్నారు. అయితే.. ఐదుగురు ఇంట్లోకి వెళ్లే ముందు వాళ్ళని స్టేజిపై కొన్ని ప్రశ్నలు అడిగారు హోస్ట్ నాగార్జున. అలానే నయని పావనిని కూడా అడిగారు. స్క్రీన్ పై తేజ(Teja),యావర్(Yawar),పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) ఫోటోలను చూపించి ఈ ముగ్గురిలో ఎవరిని ఫ్రెండ్ లా ఫిల్ అవుతావు, ఎవరిని డేట్ చేస్తావు, ఎవరిని పెళ్లి చేసుకుంటావు అని అడిగారు. దీంతో కాసేపు ఆలోచించిన నయని పావని.. తేజ ని ఫ్రెండ్ అని, యావర్ తో డేట్ చేస్తా అని అని చెప్పుకొచ్చింది. ఇక మిగిలింది ఒక్కరే కాబట్టి పల్లవి ప్రశాంత్ ను పెళ్లి చేసుంటాను అని చెప్పుకొచ్చింది నయని పావని. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక నయని పావని విషయానికి వస్తే.. ఆమె టిక్ టాక్ ద్వారా పాపులర్ అయ్యారు. తెలంగాణకు చెందిన ఈమె అసలు పేరు సాయి పావని రాజ్. టిక్ టాక్ ద్వారా పాపులారిటీతోనే వరుసగా షార్ట్ ఫిలిమ్స్ లో అవకాశాలు దక్కించుకుంది ఈ బ్యూటీ. వాటిలో.. ఎంత ఘాటు ప్రేమ, సమయం లేదు మిత్రమా, పెళ్లి చూపులు 2.0 వంటి హిట్ షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి. ఈ ఫేమ్ తోనే ఇప్పుడు బిగ్ బాస్ లో ఛాన్స్ దక్కించుకుంది.