తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. మహిళ మృతి

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. మహిళ మృతి

తిరుమలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్ర వాహనం.. అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఘటనలో మహిళ అక్కడికక్కేడ ప్రాణాలు కోల్పోయింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్ లోని 16వ మలుపు వద్ద ఘటన చోటుచేసుకుంది. జనవరి 12వ తేదీ శుక్రవారం తిరుమల నుండి తిరుపతికి వస్తుండగా..  బైక్ కంట్రోల్ తప్పి ..ఎదురుగా వచ్చిన బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో తీవ్రంగా గాయపడిన జ్యోతి అనే మహిళా మృతి చెందింది. 

చికిత్స కోసం వెంటనే తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మరో ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు. మృతురాలు గుంటూరు జిల్లా మాచర్ల ఎర్రగడ వీధికి చెందిన దాసరి జ్యోతిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని స్విమ్స్ ఆసుపత్రి నుండి రుయా మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.