శాలరీలు సరిపోక అదనపు ఇన్కమ్పై ఫోకస్
డైలీ రూ.100 నుంచి రూ.300 వరకు ఆదాయం
హైదరాబాద్, వెలుగు:
సిటీలో ప్రైవేట్జాబ్లు చేసేవారు బైక్ రైడర్స్ గా మారుతున్నారు. శాలరీలు సరిపోక కొందరు, ఉపాధికి ఇంకొందరు, పెట్రోల్ ఖర్చులు తగ్గించుకునేందుకు మరికొందరు ఓలా, ఊబెర్, ర్యాపిడో లాంటి సంస్థల్లో పార్ట్ టైమ్ జాబర్స్ గా చేస్తున్నారు. ఉదయం ఆఫీసులకు వెళ్లే ముందు, సాయంత్రం వచ్చే ముందు పికప్ అండ్ డ్రాప్స్ తీసుకుంటున్నారు. బుకింగ్స్ టైమ్లో ఏ ఏరియాకి కావాలంటే సంస్థలు ఆ ప్రాంతానికి ఇస్తున్నాయి. దీంతో చాలా మంది జాబర్స్ పార్ట్ టైమ్ రైడర్స్గా చేస్తున్నారు. సిటీలో మొత్తం 26 వేల మంది ఉండగా, ఇందులో 16 వేల మంది పార్ట్ టైమ్ గా చేసేటోళ్లే ఉన్నారు. కరోనాకు ముందు 7 వేల మంది పని చేసేవారు. వీరితో పాటు ఏ పనిలేని వారికి కూడా ఉపాధిగా మారింది. పార్ట్ టైమ్ గా రూ.100 నుంచి రూ.300 వరకు, ఫుల్టైమ్ గా రూ.700 నుంచి రూ. వెయ్యికి పైగా సంపాదిస్తున్నారు. యూత్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. పెట్టుబడి లేకపోవడంతో పాటు డెలివరీ సంస్థలు కూడా ఆఫర్లు, కమీషన్ ఇస్తుండగా బైక్ రైడర్స్ కి ఫుల్ డిమాండ్ పెరిగింది. నాలుగైదు సంస్థల్లో కూడా లాగిన్ ఐడీలను తీసుకొని ఎక్కువ ఇన్కమ్ ఉన్న దాంట్లో జాయిన్ అవుతున్నారు.
ఎలాంటి పెట్టుబడి లేకపోవడంతో..
ఏ చిన్న బిజినెస్ చేయాలన్న కూడా ఎంతో కొంత ఇన్వెస్ట్ మెంట్ పెట్టాలి. బైక్ రైడర్ గా అయితే టూ వీలర్ఉంటే చాలు. ఐడీ తీసుకుని రైడ్కు వెళ్లొచ్చు. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కొన్ని సంస్థలు జాయిన్ అయితే చాలు ఆఫర్లను కూడా ఇస్తున్నాయి. దీంతో చాలా మంది రైడర్స్ గా చేరేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సిటీలో10 వేల మందికిపైగా ఫుల్ టైమ్ రైడర్స్ పని చేస్తున్నారు. జాబ్స్ కోల్పోయిన వారు, మానేసిన వారు కూడా ఖాళీగా ఉండలేక రైడ్ చేస్తూ ఉపాధి పొందుతున్నారు. టైమ్ లేకపోవడంతో ఆఫీసులకు వెళ్లి వచ్చేటప్పుడు లాగిన్ అయి బుకింగ్లను తీసుకుంటు న్నారు. దీంతో అదనపు ఆదాయం వస్తుండగా చాలా మంది రైడర్స్గా కొత్తగా జాయిన్అవుతున్నట్లు ఆయా సంస్థల వెండర్స్చెబుతున్నారు.
డెలివరీ బాయ్స్ కి తరహాలో డిమాండ్
బైక్ రైడర్స్ తో పాటు సిటీలో డెలివరీ బాయ్స్ కి డిమాండ్ ఏర్పడింది.10 మినిట్స్, 30 మినిట్స్ లో డెలివరీ ఇస్తామంటూ ఆన్ లైన్ సంస్థలు ఏర్పాటవుతుండగా చాలా మందికి ఉపాధి లభిస్తుంది. ప్రస్తుతం ఏ వస్తువులనైనా ఒకచోట నుంచి మరోచోటకు తెప్పించేందుకు వెళ్లి తీసుకొస్తే టైమ్ వేస్ట్ అవుతుందని డెలివరీ సంస్థల యాప్ లను జనాలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఉదాహరణకు ఉస్మాన్గంజ్లో ఓ వ్యాపారి షాపు తాళాలు ఇంట్లో మరిచిపోయి వెళ్లాడు. ఆయన ఇల్లు మాసబ్ ట్యాంక్ లో ఉండగా, ఆయన వెళ్లి తీసుకొస్తే ఎక్కువ టైమ్ పడుతుందని ఓ డెలివరీ యాప్లో బుక్ చేసుకొని 15 నిమిషాల్లో తాళాలను తెప్పించుకున్నాడు. ఇలా ఏ పనికైనా డెలివరీ యాప్స్ ని బుక్ చేసుకుంటున్నారు. దీంతో నాలుగైదు సంస్థల్లో లాగిన్ ఐడీలు తీసుకొని దేంట్లో బుక్కింగ్స్వస్తే దాంట్లో పనిచేస్తున్నారు.
ఆదాయం కోసం ..
కరోనాతో ఎంతో మంది జాబ్లు కోల్పోయారు. సిటీలో ఉండలేక సొంతూళ్లకు వెళ్లి ఏదో ఒక పనిచేసుకుంటూ ఉండిపోయారు. ప్రస్తుతం జాబ్లు చేస్తున్న వారికి మెజారిటీ స్థాయిలో రెండేండ్లు సరిగా శాలరీలు పెరగలేదు. కొన్ని సంస్థలైతే కట్ చేస్తుండగా, వచ్చిన శాలరీ సరిపోక కొందరు, అదనపు ఆదాయం కోసం ఇంకొందరు బైక్ రైడర్స్గా పని చేస్తున్నట్లు చెబుతున్నారు. ఫుల్టైమ్ రైడర్ గా పనిచేస్తే ప్రస్తుతం పనిచేస్తున్న జాబ్కంటే ఎక్కువ సంపాదన వస్తుందని, అయినా ఉన్నత చదువులు చదివి రైడర్గా పనిచేస్తే ప్యూచర్ ఎలా ఉంటుందోనని జాబ్తోపాటు పార్ట్ టైమ్ గా రైడ్ చేస్తున్నట్లు కొందరు పేర్కొంటున్నారు.
ఆఫీసుకు వెళ్లేటప్పుడు..
చిన్న కంపెనీలో జాబ్ చేస్తుండగా, నెలకి 17 వేల శాలరీ వస్తుంది. రేట్లు పెరిగిపోవడంతో ఇల్లు గడవడం కష్టమైతుంది. ఉబెర్లో రిజిస్టర్ చేసుకుని బైక్రైడ్కు వెళ్తున్నా. మార్నింగ్ ఆఫీస్ కి వెళ్లేటప్పుడు టోలిచౌకి నుంచి ఖైరతాబాద్ కి రైడ్ ఆన్ చేస్తా. ఆ రూట్ లో వచ్చే రైడ్లను యాక్సెప్ట్ చేసి కస్టమర్లను దింపి వెళ్తుంటా. పెట్రోల్ ఖర్చు పోయి కొంత అదనంగా సంపాదిస్తున్నా. - రామాచారి, బైక్ రైడర్, టోలిచౌకి
జాబర్స్నే ఎక్కువగా జాయిన్..
రైడర్స్గా చేసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుండగా జాబ్చేస్తున్న వారు పార్ట్ టైమ్ గా జాయిన్ అవుతున్నారు. బుకింగ్స్ కూడా వారి ఆఫీసులకు సమీపంలో వస్తుండడంతో పార్ట్టైమ్ రైడర్స్ గా చేరుతున్నారు. కరోనా తర్వాత రైడర్స్ఎక్కువయ్యారు. సిటీలో ఎక్కడినుంచైనా క్షణాల్లో బుకింగ్స్ వస్తుండగా యూత్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు.
- శివ, ఓలా వెండర్