వ్యాక్సిన్‌ అవసరమైన ప్రజలకు ముందుగా చేరాలి: బిల్‌గేట్స్

వ్యాక్సిన్‌ అవసరమైన ప్రజలకు ముందుగా చేరాలి: బిల్‌గేట్స్

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అభివృద్ధి చెందిన యూరప్‌, అమెరికాలు కరోనా వ్యాక్సిన్ డెవలప్‌మెంట్ కోసం బిలియన్ల డాలర్లు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్‌కు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే ధనిక దేశాలు దాన్ని ముందుగా తన్నుకెళ్తాయని.. తద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ట్రీట్‌మెంట్ కోసం మందులు, వ్యాక్సిన్ అందవని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై మైక్రోసాఫ్ట్‌ ఫౌండర్, ప్రపంచ కుబేరుల్లో ఒకరరైన బిల్ గేట్స్ తన అభిప్రాయాలను చెప్పారు.

కరోనా మందులు, వ్యాక్సిన్‌ను అవసరం ఉన్న సామాన్య ప్రజలకు ముందుగా చేరవేయాలని మైక్రోసాఫ్ట్‌ ఫౌండర్ బిల్‌ గేట్స్‌ కోరారు. సాధారణ ప్రజలకు కాకుండా హయ్యస్ట్ బిడ్డర్‌‌కు వ్యాక్సిన్‌ను ఇవ్వకూడదన్నారు. ‘ఒకవేళ మందులు, వ్యాక్సిన్‌ను అవసరం ఉన్న ప్రజలకు కాకుండా హయ్యస్ట్‌ బిడ్డర్‌‌కు ఇస్తే కరోనా మహమ్మారి చాలా కాలంపాటు ఇక్కడే ఉంటుంది. మార్కెట్ కారకాల ఆధారంగా కాక సమానత్వం బేస్డ్‌గా వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించేలా నాయకులు కఠిన నిర్ణయాలు తీసుకోవాలి’ అని ఇంటర్నేషనల్ ఎయిడ్స్ సొసైటీ నిర్వహించిన కొవిడ్–19 కాన్ఫరెన్స్ మీటింగ్‌లో బిల్‌ గేట్స్ సూచించారు.