వెయ్యి డాలర్ల కిందకు  పడిపోయిన ఎథీరియమ్‌

 వెయ్యి డాలర్ల కిందకు  పడిపోయిన ఎథీరియమ్‌

న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీల పతనం  ఇంకా కొనసాగుతోంది. పాపులర్ క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాయిన్ శనివారం 20 వేల డాలర్ల కిందికి పడింది. గత 18 నెలల్లో  బిట్‌‌‌‌‌‌‌‌కాయిన్‌‌‌‌‌‌‌‌కు ఇదే  కనిష్ట లెవెల్‌‌‌‌‌‌‌‌. గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా వడ్డీ రేట్లు పెరుగుతుండడంతో రిస్క్ ఎక్కువగా ఉండే అసెట్ల నుంచి ఇన్వెస్టర్లు తమ ఫండ్స్‌‌‌‌‌‌‌‌ను తీసేస్తున్నారు. బిట్‌‌‌‌‌‌‌‌కాయిన్ శనివారం 8 %  నష్టపోయి 18,993 డాలర్ల (రూ.15 లక్షల) ను టచ్ చేసింది.  ఒకానొక దశలో బిట్‌‌‌‌‌‌‌‌కాయిన్ వాల్యూ రూ. 54 లక్షలకు పెరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బిట్‌‌‌‌‌‌‌‌కాయిన్ వాల్యూ  59 % తగ్గగా,  రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ అయిన ఎథీరియమ్ ఈ ఏడాది 73% క్రాష్ అయ్యింది.  ఎథీరియమ్‌‌‌‌‌‌‌‌ శనివారం 9% నష్టపోయి 976 డాలర్లకు(రూ.76 వేల) దిగొచ్చింది. ముఖ్యంగా క్రిప్టో ఎక్స్చేంజిల్లో ట్రేడింగ్ వాల్యూమ్స్ బాగా పడ్డాయి. గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా, లోకల్‌‌‌‌‌‌‌‌గా టాప్ క్రిప్టో ఎక్స్చేంజిలు తమ ఉద్యోగులను తొలగించడం ప్రారంభించాయి.