చాలా మంది ఇండియన్లు  మహిళలను మనుషులుగా చూడట్లే

 చాలా మంది ఇండియన్లు  మహిళలను మనుషులుగా చూడట్లే

ఢిల్లీలో 20 ఏళ్ల యువతిపై మూకదాడి జరగడంపై  కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. సమాజం సిగ్గుపడే ఘటన అని అన్నారు. అత్యాచార బాధితురాలైన ఆయువతిని స్థానిక యువకులు చుట్టుముట్టి కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాల్లో సంచలనానికి దారి తీసింది. దీనిపై రాహుల్ గాంధీ స్పందించారు.

20 ఏళ్ల మహిళపై దారుణంగా దాడి చేసిన వీడియో కలవరానికి గురిచేసే మన సమాజపు ముఖాన్ని తెలియజేస్తోందన్నారు రాహుల్ గాంధీ. చేదు నిజం ఏమిటంటే.. చాలా మంది భారతీయులు మహిళలను మనుషులుగా చూడకపోవడం. సిగ్గుచేటైన ఈ నిజాన్ని గుర్తించాల్సి ఉందన్నారు. దాన్ని పారదోలాల్సి ఉందని అన్నారు . మరోవైపు ఈ వీడియో బయటపడిన తర్వాత  ఢిల్లీ పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. దీనిపై విచారణ నిర్వహిస్తున్నామని, సామాజిక మాధ్యమాల్లో వదంతులను వ్యాప్తి చేయవద్దని కోరారు. బాధితురాలు ఆరోగ్యంగానే ఉందని తెలిపారు.

 

మరిన్ని వార్తల కోసం...

 

నీట్లో రెండు సార్లు ర్యాంకు.. డబ్బుల్లేక వ్యవసాయం