- గ్రేటర్లో కూకట్ పల్లి కేటాయింపు. . ఇక్కడే మరో సీటు ఇచ్చే చాన్స్
- పవన్ కల్యాణ్తో కిషన్రెడ్డి, లక్ష్మణ్ చర్చలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో జనసేన పొత్తు దాదాపు కొలిక్కి వచ్చింది. శనివారం రాత్రి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఇంటికెళ్లి పొత్తులపై బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ చర్చించారు. 32 సీట్లు ఇవ్వాలని పవన్ కోరగా, 9 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ నేతలు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలిసింది. మరో సీటు ఇవ్వాలని పవన్ కోరగా అంగీకరించినట్టు సమాచారం. కూకట్పల్లి, మెదక్, తాండూరు, నాగర్కర్నూల్, కోదాడ, అశ్వారావుపేట, వైరాతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో మరో సీటు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. మరో రెండు సీట్లపై క్లారిటీ రావాల్సి ఉంది. సమావేశం అనంతరం పవన్, కిషన్రెడ్డి, లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు.
32 సీట్లు అడిగినం: పవన్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 32 సీట్లలో తాము పోటీ చేయాలని భావించామని పవన్కల్యాణ్ తెలిపారు. ఎన్డీఏ భాగస్వామ్యపక్షంగా బీజేపీతో చర్చలు జరిపామని, సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయన్నారు. తాము పోటీ చేసే స్థానాలపై చర్చలు తుది దశకు వచ్చాయన్నారు. రెండు సీట్లపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని, దీనిపై తమ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో మరోసారి చర్చిస్తారని తెలిపారు. మోదీ మూడోసారి ప్రధాని కావాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. ఈ నెల 7న హైదరాబాద్లో నిర్వహించే ప్రధాని సభలో పాల్గొంటానన్నారు. కాగా, పవన్తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన నేత శంకర్ గౌడ్ తెలిపారు. తెలంగాణలోనూ వారాహి యాత్ర ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది: కిషన్రెడ్డి
జనసేనతో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చిందని కిషన్రెడ్డి తెలిపారు. రెండు సీట్లపై ఇంకా చర్చించాల్సి ఉందన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఎంతో కీలకమైనవని, రాష్ట్రంలో డబుల్ఇంజన్సర్కార్రావాల్సిన అవసరం ఉందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన బీజేపీకి సహకరించిందని తెలిపారు. ఈ నెల 7న ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభకు పవన్ను ఆహ్వానించామని, ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. జనసేన మద్దతుతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ఎంపీ లక్ష్మణ్తెలిపారు. తెలంగాణలో డబుల్ఇంజన్సర్కార్రావాల్సి ఉందని, దేశానికి మూడోసారి మోదీ ప్రధాని కావాల్సిన అవసరం ఉందన్నారు. తమతో కలిసి పనిచేసేందుకు పవన్సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిపారు.