
కోల్కతా: లాటరీల పేరుతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) మనీ లాండరింగ్కు పాల్పడుతోందని బెంగాల్ అపోజిషన్ లీడర్ సువేందు అధికారి ఆరోపించారు. టీఎంసీ ఎమ్మెల్యే వివేక్ గుప్తా భార్యకు కోటి రూపాయల లాటరీ తగిలిందనడంలో నిజంలేదని విమర్శించారు. అధికార పార్టీ నేతలు లాటరీ పేరుతో మనీ లాండరింగ్కు పాల్పడుతున్నారని ఆరోపించారు. సాధారణ జనాలు కూడా లాటరీ టికెట్లు కొంటున్నా.. బంపర్ ప్రైజులు టీఎంసీ లీడర్లకే తగులుతు న్నాయని అన్నారు.
ఇటీవలే టీఎంసీ నేత అనుబ్రతా మండల్ కోటి రూపాయల బంపర్ ప్రైజ్ గెలుచుకున్నారని, ఇప్పుడు ఎమ్మెల్యే భార్యకు కోటి రూపాయలు వచ్చాయని అన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ‘డియర్ లాటరీ’ కంపెనీకి లావాదేవీలపై ఇన్వెస్టిగేషన్ చేయాలని కోరామన్నారు. సువేందు విమర్శలపై టీఎంసీ ఎమ్మెల్యే వివేక్ గుప్తా స్పందించారు. తన భార్యపై రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు. ‘‘నా భార్యకు రాజకీయాల తో ఎలాంటి సంబంధంలేదు. లాటరీ కంపెనీ లను ఇన్ఫ్లూయెన్స్ చేసేంత పవర్ ఉందని నాకే తెలియదు”అని వివేక్ గుప్తా అన్నారు.