కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షురాలు ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. పొద్దున్న లేస్తే.. కాంగ్రెస్ నేతలు.. బీజేపీపై.. బీజేపీ నాయకులు కాంగ్రెస్ పై విమర్శలు చేసుకోవడం తెలిసిందే. ఎన్నికల సమయంలో విమర్శల జోరు మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే తాజాగా బీజేపీ నేతలు ప్రియాంకను పలకరించడం.. ఆమె అప్యాయంగా మాట్లాడటం జరిగింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ప్రియాంక గాంధీ లక్నోలో రోడ్ షో ముగించుకుని ఆమె తిరిగి వెళ్తుండగా.. బీజేపీ ప్రచార సభకు వెళ్లి వస్తున్న ఆ పార్టీ కార్యకర్తలూ అదే దారిలో ఎదురుపడ్డారు.
ప్రియాంకను చూసి గట్టిగా అరిచారు. ఆమెతో షేక్ హ్యాండ్ తీసుకోవడానికి ఎగబడ్డారు. మరికొందరు సెల్ఫీలు తీసుకోవడానికి కూడా ఆసక్తి చూపించారు. ఇంకొందరు ప్రియాంకను కాంగ్రెస్ మేనిఫెస్టో అడిగారు. దీంతో ఆమె మేనిఫెస్టో పత్రానికి వారికి వచ్చారు. ఓ యువకుడు ప్రియాంక గాంధీని బ్రేస్ లెట్ అడగగా ఏమాత్రం సందేహంచకుండా ఆమె తన చేతికున్న బ్రేస్ లెట్ తీసి ఇచ్చేశారు. ఈ ఆసక్తికర పరిణామం యూపీ ఎన్నికల ప్రచారంలో చోటుచేసుకుంది. ఆ వీడియోను కాంగ్రెస్ యూపీ విభాగం ట్వీట్ చేసింది. రాజకీయాల్లో ఇలాంటి చిత్రాలు చాలా అరుదని..యువత ఇప్పుడు గొడవలు, విద్వేషాలను కోరుకోవడం లేదని, ఉద్యోగాలు కావాలంటున్నారని, అందుకు బీజేపీ ప్రచార సభకు వెళ్లి వస్తున్న ఈ యువతే నిదర్శనమని ట్వీట్ లో వెల్లడించింది.
ఇవి కూడా చదవండిః