మున్సిపల్ ఎలక్షన్లకు బీజేపీ ఇన్చార్జ్ల నియామకం : జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్

మున్సిపల్ ఎలక్షన్లకు బీజేపీ ఇన్చార్జ్ల నియామకం : జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో త్వరలో జరగనున్న  మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. కార్పొరేషన్ ఎన్నికల ఇన్ చార్జ్ గా మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెలార్, కో- ఇన్ చార్జ్ లుగా బీజేపీ రాజస్తాన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అశోక్ పర్ణమి, రాజ్యసభ ఎంపీ రేఖాశర్మను నియమించింది. ఈ మేరకు మంగళవారం పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. పార్టీ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆమోదం మేరకు ఈ నియామకాలు చేపట్టినట్టు తెలిపారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. 

అలాగే కేరళ,  గ్రేటర్ బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికలకు పార్టీ ఇన్ చార్జ్, కో ఇన్ చార్జ్ లను, చండీగఢ్ మేయర్ ఎన్నికలకు పరిశీలకులను నియమించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఇన్ చార్జ్​గా పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే, కో ఇన్ చార్జ్ గా కేంద్ర మంత్రి శోభా కర్లందాజే, గ్రేటర్ బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికల ఇన్ చార్జ్ గా రాం మాధవ్, కో- ఇన్ చార్జ్ లుగా సతీశ్ పూనియా, సంజయ్ ఉపాధ్యాయ్, చంఢీగడ్ మేయర్ ఎన్నికల అబ్జర్వర్ గా వినోద్ తావ్డేకు బాధ్యతలు అప్పగించారు.