మహిళా గోస–బీజేపీ భరోసా పేరుతో బండి సంజయ్ దీక్ష

మహిళా గోస–బీజేపీ భరోసా పేరుతో బండి సంజయ్ దీక్ష

తెలంగాణలో జరుగుతున్న అన్యాయాన్ని దేశమంతా తెలియాజేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో 2023, మార్చి 10వ తేదీన హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో పెరిగిన బెల్ట్ షాపులకు నిరసనగా మహిళా గోస–బీజేపీ భరోసా పేరుతో ఈ దీక్ష నిర్వహించనున్నారు. ఈ దీక్షలో బండి సంజయ్ తోపాటు డీకే అరుణ, బీజేపీ నేతలు పాల్గొననున్నారు. మరోవైపు లిక్కర్ స్కాంకు వ్యతిరేకంగా ఢిల్లీలో బీజేపీ నిరసనలు చేపట్టనుంది. దీన్ దయాల్ మార్ఘ్ లోని ఆంధ్ర స్కూల్ వద్ద బీజేపీ నేతలు ధర్నాకు దిగనున్నారు.