ప్రధాని మోడీని కలిసిన బీజేపీ కార్పొరేటర్లు

ప్రధాని మోడీని కలిసిన బీజేపీ కార్పొరేటర్లు

ప్రధాని మోడీని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ)లోని బీజేపీ కార్పొరేటర్లు కలిశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ సమక్షంలో మోడీని కలిసారు కార్పొరేటర్లు. 47 మందితో పాటుగా మొత్తం 75 మంది ప్రధాని మోడీ అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ బలోపేతంపై కార్పొరేటర్లకు మోడీ దిశానిర్దేశం చేసినట్టుగా సమాచారం. అయితే ఇటీవల మోడీ హైదరాబాద్ వచ్చిన సందర్భంలో బేగంపేట్ ఎయిర్ పోర్టులో  వీడ్కోలు పలికేందుకు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు వెళ్లారు. ఎయిర్​పోర్టులో గాలి దుమారం, వర్షం కారణంగా కార్పొరేటర్లతో మోడీ పరిచయ కార్యక్రమం రద్దయింది.