15 రూపాయల కోసం.. ఇంత దారుణమా..

15 రూపాయల కోసం.. ఇంత దారుణమా..

15 రూపాయల కోసం స్థానిక దుకాణదారుడిపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కౌన్సిలర్, అతని సహచరులు దాడి చేశారు. భవానీ శంకర్, అతని సహాయకులు వృద్ధ దుకాణదారుడిని బెదిరించారు. మొబైల్‌ ఫోన్‌లో రికార్డు అయిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

కాన్పూర్‌లోని చకేరీ అజయ్ రాయ్ గుప్తా పాన్ షాపులో ఈ సంఘటన జరిగింది. ఇక్కడ బీజేపీ కౌన్సిలర్ శంకర్, అతని సహచరులు రూ. 30 విలువైన సిగరెట్లను కొనుగోలు చేశారు. అయితే వారు కేవలం రూ. 15 మాత్రమే చెల్లించారు. మిగిలిన మొత్తం ఇవ్వాలని దుకాణదారుడు కోరడంతో శంకర్‌తో పాటు అతని సహచరులు అతనితో గొడవకు దిగారు.

గంజాయి అమ్మినందుకు దుకాణదారున్ని జైలుకు పంపుతానని బీజేపీ కౌన్సిలర్ బెదిరించాడు. వృద్ధుడు తన డబ్బు అడిగినందుకు వారు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, కౌన్సిలర్ మరొక వీడియోను విడుదల చేశాడు. పోలీసు స్టేషన్‌లో పరస్పర ఒప్పందం కుదుర్చుకున్నామని నొక్కి చెప్పాడు.

అయితే ఈ వీడియోపై సోషల్ మీడియా యూజర్లు స్పందిస్తూ రాష్ట్రంలో బీజేపీ పాలనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇరువర్గాలను పోలీస్ స్టేషన్‌కు పిలిపించినట్లు పోలీసులు ధృవీకరించారు. పోలీసుల జోక్యాన్ని నివారించేందుకు అంగీకరించారు.