ప్రజా సంగ్రామ యాత్ర : హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ

ప్రజా సంగ్రామ యాత్ర : హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ

ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఈ పాదయాత్రకు అనుమతివ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మధ్యాహ్నం 12గంటలకు జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్ విచారణ చేపట్టనుంది. కోర్టు ఉత్తర్వుల మేరకు బండి ఐదో విడత పాదయాత్ర కొనసాగింపునపై స్పష్టత వచ్చే అవకాశముంది. మరోవైపు కరీంనగర్ లోని బండి సంజయ్ నివాసం వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఆయన బయటకు వస్తే అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు సభ, పాదయాత్ర నిర్వాహణపై బండి సంజయ్ కరీంనగర్లోని తన నివాసంలో  లీగల్ టీంతోచర్చలు జరుపుతున్నారు.

ఇవాళ్టి నుంచి బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభంకానుంది. భైంసాలో సభ అనంతరం ఆయన పాదయాత్రకు సిద్ధమయ్యారు. అయితే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశముందన్న కారణంతో పోలీసులు బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి నిరాకరించారు. నిన్న బైంసాకు వెళ్తున్న ఆయనను అడ్డుకున్నారు.