ఐటీ రెయిడ్స్​తో బీజేపీకి సంబంధం లేదు : కిషన్ రెడ్డి

ఐటీ రెయిడ్స్​తో బీజేపీకి సంబంధం లేదు : కిషన్ రెడ్డి

శంషాబాద్, వెలుగు: మహేశ్వరం నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతల ఇండ్లలో ఐటీ రెయిడ్స్​పై కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఐటీ దాడులతో తమకు సంబంధం ఉండదని.. ఐటీ మా పర్యవేక్షణలో ఉండదన్నారు. రెయిడ్స్ జరిగినట్లు మీడియా చెబితేనే తనకు తెలిసిందన్నారు.

ఎవరి నుంచైనా ఫిర్యాదులు వస్తేనే ఐటీ అధికారులు రెయిడ్స్ చేస్తారని.. 50 ఏండ్లుగా ఐటీ అధికారులు దర్యాప్తులు కొనసాగిస్తున్నారు. అదే పద్ధతిలో ఇప్పుడు కూడా దర్యాప్తులో భాగంగానే రెయిడ్స్ నిర్వహిస్తారన్నారు. ఈ దాడులకు బీజేపీకి ఎలాంటి సంబంధం ఉండదని తెలిపారు.

ALSO READ : కాంగ్రెస్ లో అసంతృప్తులతో నేతల చర్చలు