దుర్మార్గం : బీజేపీ మహిళా నేతను చంపి.. హైవేపై పడేశారు

దుర్మార్గం : బీజేపీ మహిళా నేతను చంపి.. హైవేపై పడేశారు

బీజేపీ మహిళా నాయకురాలిని హత్య చేసి హైవేపై పడేసిన ఘటన అసోంలో సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్​పరా జిల్లా కు చెందిన బీజేపీ కార్యదర్శి జోనాలినాథ్​ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అనంతరం కృష్ణాయ్​లోని సల్పరా వద్ద నేషనల్​ హైవే 17 సమీపంలో పడేశారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పక్కా ప్లాన్​ప్రకారమే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. 

సంతాప తెలిపిన నేతలు..

జొనాలినాథ్​ మృతి పట్ల అసోం నేతలు సంతాపం తెలిపారు. అసోం మంత్రి బిమల్​ బోరా మాట్లాడుతూ.. ఆమె మృతి విషాదకరమని అన్నారు. నిందితులకు శిక్ష పడేలా చేసి వారి కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. నిబద్ధత, అవిశ్రాంతంగా పని చేసే గొప్ప వ్యక్తిని పార్టీ కోల్పోయినట్లు బీజేపీ అధికార ప్రతినిధి జ్యూరీ శర్మ బోర్డోలోయ్​ అన్నారు. ఆమెను హత్య చేసిన నిందితులను పట్టుకునేలా సమగ్ర విచారణ జరుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.