హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాంతాన్ని కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో కలపాలి : ఖమ్మం వెంకటేశం

హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాంతాన్ని కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో కలపాలి :  ఖమ్మం వెంకటేశం

కోహెడ, వెలుగు:  కోహెడ, హుస్నాబాద్​, అక్కన్నపేట మండలాలను తిరిగి కరీంనగర్​ జిల్లాలో కలపాలని బీజేపీ జిల్లా కౌన్సిల్​ మెంబర్ ​ఖమ్మం వెంకటేశం కోరారు. బుధవారం కోహెడలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్  అధికారంలోకి వస్తే హుస్నాబాద్​ ప్రాంతాన్ని కరీంనగర్​ జిల్లాలో కలుపుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైన ఎందుకు కలపడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.  ఈ ప్రాంత వాసులు ఉమ్మడి జిల్లాలో  జరిగే పనులకు కొన్నింటికి సంగారెడ్డి,మరి కొన్నింటికి కరీంనగర్​ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.  

వెంటనే దీనిపై మంత్రి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.  లేకుంటే వారం రోజుల్లో మరోసారి ఉద్యమానికి కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. సమావేశంలో మండల అధ్యక్షుడు రమేశ్, నాయకులు నర్సయ్య, చంద్రశేఖర్​రెడ్డి, శ్రీనివాస్, జగన్​,శివ,రాంచంద్రరెడ్డి,సాగర్​రావు,రాజు,సంజీవరెడ్డి,అనిల్​ తదితరులు ఉన్నారు.