ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే విద్యార్థులపై దాడి చేస్తారా?

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే విద్యార్థులపై దాడి చేస్తారా?

అసెంబ్లీ వద్ద ఏబీవీపీ విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్ ని ఖండించారు బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ. కేసీఆర్ నిరంకుశ ధోరణికి విద్యార్ధులపై లాఠీ ఛార్జీయే నిదర్శనమన్నారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించమంటే విద్యార్ధులపై దాడి చేయడం సిగ్గు చేటన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడిగితే విద్యార్ధులపై దాడి చేస్తారా అని ప్రశ్నించారు. విద్యార్థుల ఉద్యమాన్ని ఆణిచివేయడం కేసీఆర్ వల్ల కాదన్నారు. ఏబీవీపీ విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల సమస్యలు ప్రభుత్వం పై పోరాటం చేస్తామన్నారు. విద్యార్థులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు.

see more news

విద్యార్థి ఉద్యమాలను అణచివేయడం కేసీఆర్ తరం కాదు

కాంగ్రెస్ ప్రభుత్వాన్నికూల్చడంలో మోడీ బిజీ

హయత్ నగర్లో చిన్నవివాదం ప్రాణం తీసింది